రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

జగన్ మీడియా సమావేశాలు అబద్ధాలకే పరిమితం: వాసిరెడ్డి పద్మ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

జగన్ మీడియా సమావేశాలు అబద్ధాలకే పరిమితం: వాసిరెడ్డి పద్మ

  • వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు
  • రైతు సమస్యలపై కేంద్రానికి లేఖలు రాయాలని సూచన
  • మహిళల రక్షణపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదని వ్యాఖ్య

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, 11 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
మాజీ మహిళా కార్పొరేషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ నిర్వహిస్తున్న మీడియా సమావేశాలు అసత్యాలు, అబద్ధాలు చెప్పేందుకే పరిమితమైపోయాయని ఆరోపించారు. వైసీపీ హయాంలోనే కాగ్ నివేదిక వెలువడిందని, ఆ నివేదికలో ఉన్న విషయాలను కూడా జగన్ ప్రజలకు చదివి వినిపించాలని సూచించారు. అప్పుల అంశంపై కేంద్రానికి లేఖలు రాయడం కాకుండా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని వాసిరెడ్డి పద్మ అన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోవడం జగన్ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. మహిళలపై వైసీపీ నేతలు వేధింపులకు పాల్పడినప్పుడు తగిన చర్యలు తీసుకోని జగన్, ఇప్పుడు మహిళల రక్షణ గురించి మాట్లాడడం సరైంది కాదని ఆమె విమర్శించారు. మహిళల భద్రత విషయంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కల్తీ నెయ్యి, పరకామణి చోరీ కేసుల్లో కూడా జగన్ ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ పాలనను స్వర్ణయుగంగా చెప్పడం తగదని, అది రాక్షస యుగంలా మారిందని వాసిరెడ్డి పద్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Comments

-Advertisement-