కాంగ్రెస్ ప్రభుత్వంపై సీపీఐ ఆగ్రహం… చలో అసెంబ్లీకి పిలుపు
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
కాంగ్రెస్ ప్రభుత్వంపై సీపీఐ ఆగ్రహం… చలో అసెంబ్లీకి పిలుపు
- పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఈ నెల 20న నిరసన
- సింగరేణి రక్షణకు వారం రోజుల ఆందోళనలు
- పొత్తు కొనసాగింపుపై కాంగ్రెస్ వైఖరి స్పష్టంచేయాలని డిమాండ్
హైదరాబాద్, 11 మార్చి (పీపుల్స్ మోటివేషన్): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సీపీఐ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ మిత్రధర్మం పాటించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థను కాపాడేందుకు వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలపై కూడా విమర్శలు గుప్పించారు. అమెరికా చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని కోరుతూ ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా లేవని సాంబశివరావు విమర్శించారు. రైతులకు అందించే రైతు బంధు పథకంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐతో పొత్తు ఉండటం వల్లే పలు ప్రాంతాల్లో కాంగ్రెస్కు విజయాలు సాధ్యమయ్యాయని, లేదంటే ఇంకా ఎక్కువ స్థానాల్లో గెలిచేవాళ్లమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు సీపీఐ నాయకులను అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరి మారకపోతే పొత్తు నుంచి దూరం కావడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఫిరాయింపులపై చట్టాలు బలంగా అమలు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
Comments
