మచిలీపట్నంలో టౌన్ హాల్ ఆధునీకరణకు శ్రీకారం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
మచిలీపట్నంలో టౌన్ హాల్ ఆధునీకరణకు శ్రీకారం
- ఆధునిక ఫంక్షన్ హాల్గా అభివృద్ధి చర్యలు
- నమూనా చిత్రాలను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర
- పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు
మచిలీపట్నం, 7 మార్చి (పీపుల్స్ మోటివేషన్): మచిలీపట్నంలో ఉన్న టౌన్ హాల్ను ఆధునీకరించి ఆధునిక ఫంక్షన్ హాల్గా అభివృద్ధి చేసేందుకు మంత్రి కొల్లు రవీంద్ర చర్యలు ప్రారంభించారు. శనివారం ఉదయం 18వ డివిజన్ సచివాలయం సమీపంలోని టౌన్ హాల్ను పరిశీలించిన మంత్రి, మధ్య తరగతి ప్రజలు కూడా సులభంగా వినియోగించుకునే విధంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత అభివృద్ధి పనులకు సంబంధించిన నమూనా చిత్రాలను ఎండోమెంట్ అసిస్టెంట్ ఇంజినీర్ పి. రాధిక, ఈఓ సమ్మెట స్వామి మంత్రికి వివరించారు. భవనాన్ని ఆధునిక సదుపాయాలతో ఫంక్షన్ హాల్గా మార్చే ప్రణాళికపై చర్చించారు.
మంత్రి కొల్లు రవీంద్ర పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మచిలీపట్నం ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో ఫంక్షన్ హాల్ సదుపాయం లభిస్తుందని తెలిపారు. మధ్య తరగతి కుటుంబాలు కూడా వివాహాలు, శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు.
Comments
