రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఏటీఎం నగదు ఎత్తుకెళ్లిన డ్రైవర్ అరెస్ట్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఏటీఎం నగదు ఎత్తుకెళ్లిన డ్రైవర్ అరెస్ట్

- రూ.56 లక్షలతో పారిపోయి లగ్జరీ జీవితం

- 11 రోజుల్లో రూ.22 లక్షలు ఖర్చు చేసిన నిందితుడు

- ప్రేయసి ఆధారంగా పోలీసులకు చిక్కిన డ్రైవర్

హైదరాబాద్, 10 మార్చి (పీపుల్స్ మోటివేషన్):

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

సమయానికి జీతం రాకపోవడం, విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశతో ఓ డ్రైవర్ దొంగగా మారిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఏటీఎంలకు నగదు సరఫరా చేసే వాహనం నుంచి రూ.56 లక్షలు ఎత్తుకెళ్లిన డ్రైవర్ చివరకు పోలీసులకు చిక్కాడు. నిందితుడు 11 రోజుల్లోనే రూ.22 లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బొమ్మనహల్‌కు చెందిన అజిత్‌ సికింద్రాబాద్‌లో నివసిస్తూ సంగం సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏటీఎంలలో నగదు నిర్వహణ పనుల్లో భాగంగా అతడు వాహనం నడిపేవాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లి ఏటీఎంలో నగదు జమ చేసేందుకు వెళ్లిన సమయంలో ఇతర సిబ్బంది ఏటీఎంలోకి వెళ్లగా, వాహనంలో ఉన్న అజిత్ నగదుతో పరారయ్యాడు. వ్యాన్‌ను తెల్లాపూర్ గద్దర్ సర్కిల్ వద్ద వదిలేసిన అజిత్ నగదు పెట్టెను తీసుకుని మరో ప్రాంతానికి వెళ్లాడు. లాడ్జిలో దిగిన అనంతరం పెట్టెను కోసి అందులోని రూ.56 లక్షలను తీసుకున్నాడు. అనంతరం బళ్లారి, బెంగళూరు, పుణె, ముంబయి, సోలాపూర్ వంటి ప్రాంతాల్లో తిరుగుతూ లగ్జరీ హోటళ్లలో బస చేశాడు. క్యాబ్‌లలో ప్రయాణిస్తూ పబ్‌లకు వెళ్లి రోజుకు సగటున రూ.2 లక్షల వరకు ఖర్చు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి అతని కదలికలపై నిఘా పెట్టారు. విశాఖపట్నంలో ఉన్న తన ప్రేయసితో అజిత్ మాట్లాడిన ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు అతడి వివరాలు సేకరించారు. అనంతపురంలోని సోదరి ఇంటికి వెళ్లిన అజిత్ తర్వాత శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతానికి చేరుకున్న సమయంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం నిందితుడి వద్ద నుంచి రూ.34 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడు నెలలుగా జీతం రాకపోవడం, డబ్బులపై ఆశ పెరగడం వల్లే ఈ దొంగతనం చేసినట్లు విచారణలో వెల్లడైంది. డ్రైవర్ల నియామకంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదనే కారణంతో సంబంధిత సంస్థపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Comments

-Advertisement-